Vidadala Rajini : సినిమాల్లోకి రాజకీయ నాయకులు ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. 2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజిని.. 2018లో వైసీపీలో చేరింది. ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆమెకు గత క్యాబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి కూడా వరించింది.
ఇప్పుడు విడదల రజిని ఓ నిర్మాణ సంస్థను స్థాపించారట. హైదరాబాద్లో కథా చర్చలు చేయటానికి ఆఫీసుని కూడా తీసుకున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఆమె చేయబోయే తొలి సినిమాకి కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. దర్శకుడు, హీరో ఎవరనే అంశాలపై త్వరలోనే క్లారిటీ రాబోతుండగా, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో మంత్రిగా ఉన్న ఆర్.కే రోజా సినిమా రంగంలో ఉండగా… ఇప్పుడు మంత్రి విడదల రజనీ కూడా ఎంటరయ్యారు.
అయితే… ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో రాజకీయాలను కాదని, హైదరాబాద్ కేంద్రంగా సినిమా రంగంపై ఫోకస్ చేస్తుండటం ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి తప్పదన్న విశ్లేఫణలు సాగుతున్న నేపథ్యంలో విడదల రజనీ వేస్తున్న అడుగులు దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మరి ఈ వార్తలపై విడదల రజిని ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…