Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలయ్య అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల అయ్యింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఫ్యాక్షనిజం, యాక్షన్ ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి అనే రాయలసీమ నాయకుడిగా, జై అనే యువకుడిగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.. వెండి తెరపై దుమ్మురేపిన ఈ సినిమా ఇకపై ఓటీటీలోనూ సందడి చేయబోతున్నది.
వీరసింహారెడ్డి సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 23వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా డిస్నీ పల్స్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్ డేట్ చూడగానే బాలయ్య అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెడ్డుపా అని ఎదురుచూసిన సినిమా ఓటీటీలోకి వస్తోందని తెలిసి తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా వసూళు చేసింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళు చేసిన సినిమాగా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లో 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు సహా పలువురు ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…