Tamannaah : టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తమన్నా చేయని ప్రయోగం లేదు. కథానాయికగా నటించి అలానే ఐటెం సాంగ్స్ చేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది.ఈ క్రమంలో తమన్నా హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ దటీజ్ మహాలక్ష్మి మూవీ 2020లోనే షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ క్వీన్ సీక్వెల్గా దటీజ్ మహాలక్ష్మిని రూపొందించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు సినిమాను రిలీజ్ చేయలేదు.
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించగా, మూవీకి సంబంధించిన కాపీ రైట్ప్ విషయంలో పలు వివాదాలు ఏర్పడగా, ఆ వివాదాల కారణంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక షూటింగ్ అయిన తరువాత రిలీజ్కు ఇంత గ్యాప్ రావడంతో దర్శకుడు, హీరోయిన్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి మర్చిపోయారు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేయాలని మేకర్ సన్నాహాలు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారట.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఇప్పటికే నెట్ఫ్లిక్స్తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే దట్ ఇజ్ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లియరెన్స్ కూడా రానుంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీరోల్ ప్లే చేశాడు. మరి చాలా లేట్గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు తమన్నాకి అవకాశాలు సన్నగిల్లాయి. అడపాదడపా ఏదో అలా మెరుస్తూ వెళుతుంది. చూస్తుంటే తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…