Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఆయన కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిరంజీవి మూవీ ఖైదీ నెం.150 సినిమాకు కూడా ఆమె పనిచేసింది. సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. అదే విధంగా ఆమె రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు కూడా వర్క్ చేయడం జరిగింది. నిర్మాతగానూ అదరగొడుతున్నారు. యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ‘శ్రీదేవి శోభన్బాబు’అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. దీనిపై సుస్మిత చాలా అంచనాలే పెట్టుకుంది. అయితే ఇంతకముందు సుస్మిత సేనాపతి (ఆహా) మరియు షూటౌట్ ఎట్ అలైర్ (జీ5) వంటి ఓటీటీ కంటెంట్ని నిర్మించింది. రెండు ప్రాజెక్ట్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె బ్యానర్ నుండి మంచి హిట్ తీసుకొచ్చేందుకు తపన పడుతుంది.
సుస్మిత మెగా ఇమేజ్ నుండి బయటకు వచ్చి సొంతంగా తమ టాలెంట్ నిరూపించుకోవాలని అంటుకుంటుంది. ఇప్పటి వరకు సక్సెస్ ఆమెకు దూరంగానే ఉంది, అయితే ఆమె మంచి విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. కాగా, సుస్మిత ఇటీవల శ్రీదేవి శోభన్బాబు సినిమా గురించి మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్ని అనుకోకుండా ఓ కాఫీ షాప్లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది అన్నారు. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని పేర్కొంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…