RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను గత కొంత సేపటి క్రితమే విడుదల చేయగా.. దానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. యూట్యూబ్లో ఇప్పటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం RRR నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలోనూ RRR ట్రైలర్ను రిలీజ్ చేశారు.
కాగా RRR చిత్రయూనిట్ ముంబైలో నేడు హిందీ మీడియాతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నటీనటులు, సిబ్బంది అందరూ ప్రెస్ మీట్లో పాల్గొననున్నారు. బీ టౌన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఇక చిత్రంలో లీడ్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. అయితే మరో లీడ్ హీరో రామ్ చరణ్ తేజ మాత్రం ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం లేదు.
ముంబైలో జరగనున్న RRR చిత్ర యూనిట్ ప్రెస్ మీట్కు రామ్ చరణ్ హాజరు కావడం లేదు. కారణం.. తన కుటుంబంలో ఓ వివాహ వేడుక జరగనుండడమే. రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన సోదరి అనుష్పల కామినేని వివాహం అర్మాన్ ఇబ్రహీంతో ఇటీవల జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి సంబంధించి వేడుకలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇవాళ ముంబైలో జరగనున్న ప్రెస్ మీట్కు హాజరు కాలేకపోయినప్పటికీ.. త్వరలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరగనున్న RRR చిత్ర ప్రమోషన్లలో రామ్ చరణ్ తేజ పాల్గొననున్నారు.
కాగా తాజాగా విడుదలైన RRR ట్రైలర్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న రాజమౌళి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ట్రైలర్ను చూశాక.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక RRR మూవీ జనవరి 7, 2022న ప్రపంప వ్యాప్తంగా విడుదల కానుంది. ఐమ్యాక్స్, 3డీ ఫార్మాట్లలోనూ మూవీని విడుదల చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…