RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను గత కొంత సేపటి క్రితమే విడుదల చేయగా.. దానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. యూట్యూబ్లో ఇప్పటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం RRR నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలోనూ RRR ట్రైలర్ను రిలీజ్ చేశారు.
కాగా RRR చిత్రయూనిట్ ముంబైలో నేడు హిందీ మీడియాతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నటీనటులు, సిబ్బంది అందరూ ప్రెస్ మీట్లో పాల్గొననున్నారు. బీ టౌన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఇక చిత్రంలో లీడ్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. అయితే మరో లీడ్ హీరో రామ్ చరణ్ తేజ మాత్రం ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం లేదు.
ముంబైలో జరగనున్న RRR చిత్ర యూనిట్ ప్రెస్ మీట్కు రామ్ చరణ్ హాజరు కావడం లేదు. కారణం.. తన కుటుంబంలో ఓ వివాహ వేడుక జరగనుండడమే. రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన సోదరి అనుష్పల కామినేని వివాహం అర్మాన్ ఇబ్రహీంతో ఇటీవల జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి సంబంధించి వేడుకలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇవాళ ముంబైలో జరగనున్న ప్రెస్ మీట్కు హాజరు కాలేకపోయినప్పటికీ.. త్వరలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరగనున్న RRR చిత్ర ప్రమోషన్లలో రామ్ చరణ్ తేజ పాల్గొననున్నారు.
కాగా తాజాగా విడుదలైన RRR ట్రైలర్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న రాజమౌళి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ట్రైలర్ను చూశాక.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక RRR మూవీ జనవరి 7, 2022న ప్రపంప వ్యాప్తంగా విడుదల కానుంది. ఐమ్యాక్స్, 3డీ ఫార్మాట్లలోనూ మూవీని విడుదల చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…