Roja : విలన్ పాత్రలతో పాపులరైన మన్సూర్ అలీ ఖాన్ రీసెంట్గా త్రిషపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలకి గాను తమిళ పరిశ్రమ సహా త్రిష అభిమానులు అతడిపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ”త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఊహించాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కి తీసుకెళ్లవచ్చని అనుకుంటే, కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో ఈ కుర్రాళ్ళు త్రిషను సెట్స్లో కూడా నాకు చూపించలేదు” అని మన్సూర్ చెత్త కామెంట్స్ చేశాడు.
అయితే మన్సూర్ వ్యాఖ్యలకి తీవ్రంగ స్పందించిన త్రిష.. క్రూరమైన ప్రవర్తన , తప్పుడు మనస్తత్వం కలిగిన ఇలాంటి పాతతరం నటులలో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇలాంటి వారితో నటించనుందుకు సంతోషంగా ఫీలవుతున్నానని త్రిష పేర్కొంది. షనల్ కమీషన్ ఫర్ విమెన్ సభ్యురాలు ఖుష్బూ కూడా ఈ వివాదం పట్ల తీవ్రంగా స్పందించి తన పదవి ఇచ్చిన బాధ్యతను వాడుకుంటూ అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉండేలా అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పి ఒకరకమైన హెచ్చరిక కూడా జరీ చేశారు. ఇక తాజాగా నటి, మంత్రి రోజా మన్సూర్ పై విరుచుకుపడింది. ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడే మగాళ్లపై కేసులు పెట్టి, చట్ట పరంగా తీవ్ర చర్యలు తీసుకోవాలి.
వారికి కఠినమైన శిక్ష విధించాలి. లేకుంటే ఈ మగాళ్లు భయపడరు. నాపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, త్రిష, ఖుష్బూ పై కామెంట్స్ చేసిన మన్సూర్ కావచ్చు ఎవరైనా సరే కఠినమైన శిక్షలు ఉండేలా చట్టాలు తీసుకురావాలి. మమ్మల్ని ఎవరు ఎంత టార్గెట్ చేసిన కూడా రాజకీయాలలో మా సత్తా చూపించాం. సామాన్య మహిళలని ఇలాంటి మగాళ్లు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగానే ఉంది అంటూ రోజా దారుణంగా కామెంట్ చేశారు. ఇంత జరిగినా సదరు వృద్ధనటుడికి ఏ కోశానా పశ్చాత్తాపం లేదు.. అతను రిలీజ్ చేసిన వివరణ ప్రెస్ నోట్ లో ఎక్కడ క్షమాపణ ప్రస్తావన కించిత్ కూడా లేదు. అతనికి కఠినమైన శిక్ష వేయాలంటూ మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…