RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతో నిలుస్తుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూ హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంటాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి వెళ్లి అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఇందులో కొన్ని విషయాలు పట్టుకొని ఆయన ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పరోక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా మాట్లాడుతోన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్.. వాటిలో 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడంటూ వర్మ విమర్శించారు.
తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు. నాకు తెలిసి 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు. అదే అసలు ప్రాబ్లమ్. 2 లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పగానే కుర్రాళ్లంతా ఏయ్ ఏయ్ అని అరుస్తారు. కానీ, ఏమాత్రం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్నవాడు 2 లక్షల పుస్తకాలు చదివానంటే అస్సలు నమ్మడు. అంటే, వాళ్లతో అక్కడ చప్పట్లు కొట్టించడానికి నువ్వు నీ విశ్వసనీయతను అన్ని చోట్లా కోల్పోతున్నావ్’ అని వర్మ కాస్త వెటకారమైన కామెంట్స్ చేశాడు.
అర్జెంటీనా మార్క్సిస్ట్ నేత చే గువేరా తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకోవడాన్ని కూడా రాంగోపాల్ వర్మ ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. చే గువేరా కంటే గణపతి వందల రెట్లు గొప్పోడు. చే గువేరా అక్కడ చేసిందేమీ లేదు. ఆయన్ని చాలా చిన్న వయసులో చంపేశారు. పవన్ కళ్యాణ్కు 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చే గువేరాను చూసి ఇంప్రస్ అయ్యారని.. అప్పటికి చే గువేరా గురించి పవన్కు ఏమీ తెలీదని వర్మ విమర్శించారు. మీ ప్రత్యర్థులు చేసేది ఎందుకు తప్పో వివరణాత్మకంగా చెప్పలేకుండా డైలాగులు చెప్తే అలాంటి నాయకత్వం ఎక్కువ కాలం నిలబడదు’ అని వర్మ వివరించారు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్కు తాను ఇచ్చే సలహా ఇదని.. ఆయన చేస్తున్నది తప్పు అని ఎవరైనా చెబితే బాగుంటుందని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…