సాధారణంగా మనం రోజూ అనేక రకాల పనులను చేస్తుంటాం. కొన్ని పనులను మనం తెలిసే చేస్తాం. కొన్ని పనులను చేయడం వల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే కొన్ని పనులను మాత్రం తెలియకుండానే చేస్తుంటాం. దీంతో అశుభం కలుగుతుంది. ఫలితంగా అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఎవరైనా సరే డబ్బు సంపాదించాలని.. సుఖంగా జీవించాలని.. ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండాలని.. సంతోషంగా జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టు ముడుతుంటాయి. అయితే కొన్ని రకాల పనులను మనం రోజూ చేస్తూనే ఉంటాం. కానీ వాటిని చేస్తే అశుభం జరుగుతుందని.. అన్నీ సమస్యలే వస్తాయని పండితులు చెబుతున్నారు.
ఇక కొన్ని రకాల పనులను మనం రోజు మొత్తం మీద చేసినా.. సాయంత్రం సంధ్యా సమయంలో మాత్రం కొన్ని పనులను ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. చేస్తే అరిష్టం కలుగుతుంది. అన్ని విధాలుగా సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక సూర్యాస్తమయం సమయంలో చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులను మనం ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. అవేమిటంటే.. తులసి ఆకులను సాయంత్రం సమయంలో అసలు కోయరాదు. అంతేకాదు.. ఆ మొక్కను కూడా తాకరాదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో డబ్బు చేతిలో నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే సాయంత్రం సమయంలో చీపురును వాడరాదు. సాయంత్రం కన్నా ముందే చీపురును ఉపయోగించాలి. సూర్యాస్తమయం సమయంలో చీపురును ఉపయోగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెబుతున్నారు.
ఇక సాయంత్రం సమయంలో ఇతరులు ఎవరికీ కూడా పాలు, పెరుగు, చక్కెర వంటి తెల్లని పదార్థాలను ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం సమయంలో చెత్తను బయట వేయరాదు. ఎవరికీ అప్పులు ఇవ్వరాదు. ఇస్తే వెనక్కి రావు. అలాగే సాయంత్రం సమయంలో గోర్లను, శిరోజాలను కట్ చేయరాదు. ఇలా కొన్ని పనులను మనం సూర్యుడు అస్తమించే సమయంలో చేయకూడదు. చేస్తే అన్నీ సమస్యలే వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…