RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. మంచి, చెడు ఏదైనా దానిపై ఓ ట్వీట్ చేసి వార్తలలోకి ఎక్కుతుంటారు. రీసెంట్గా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై కూడా తనదైన శైలిలో ట్వీట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి తరుముకొస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్కి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేసి వార్తలలోకి ఎక్కాడు.
ఒమిక్రాన్ వేరియంట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో ఇప్పటికే the omi kron variant అనే సినిమా 1963లోనే వచ్చిందని చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ట్యాగ్ లైన్ కూడా చెప్పమని అడిగారు. ఏదో ఒక రోజు భూమి శ్మశానంగా మారనుందని ట్యాగ్ లైన్లో రాసి ఉంది.
వర్మ ట్వీట్తో ఇది నిజమే అవుతుందంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియెంట్ ట్రేస్ అయినట్లు జీనోమ్ స్వీక్వెన్సింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…