Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. తనకు తోచినంతలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఈమె స్వతహాగా జంతు ప్రేమికురాలు. కనుక వాటికి ఏమైనా అయితే ఈమె తట్టుకోలేరు. ఇక సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఈమె స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కోల్కతా ఘటనపై కూడా రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు.
కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ కాలేజీలో ఓ పీజీ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై యావత్ దేశం కదిలింది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా రేణు దేశాయ్ కూడా ఇదే సంఘటనపై కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె ఏమన్నారంటే..
మీ కొడుకుకు మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించండి. ఎందుకంటే నేరు కూడా నా కుమార్తెకు ఎముకలు విరగ్గొట్టడం నేర్పించబోతున్నాను.. అంటూ రేణు దేశాయ్ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది. కాగా రేణు దేశాయ్ తాను పెట్టిన పోస్ట్కు బ్యాక్ గ్రౌండ్లో కరాటే నేర్పిస్తున్న ఫొటోను యాడ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట అందరినీ ఆలోచింపజేస్తోంది.
కాగా రేణుదేశాయ్ ఇప్పటికే కోల్కతా ఘటనపై స్పందించారు. సదరు సంఘటన తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. సమాజంలో మహిళలకు రోజు రోజుకీ భద్రత, రక్షణ కరువవుతుందని విచారం వ్యక్తం చేశారు. అలాంటి మానవమృగాలను కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…