క్రైమ్‌

Santhosh Kumar Jaiswal : చేస్తున్న‌ది పారిశుద్ధ్య కార్మికుడిగా.. కానీ ఇత‌ని ఆస్తి అన్ని కోట్లా..?

Santhosh Kumar Jaiswal : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండా జిల్లాలో షాకింగ్ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అక్క‌డి ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. అతని వ‌ద్ద చాలా ఖ‌రీదైన కార్లు ఉన్న‌ట్లు కూడా అధికారులు గుర్తించారు. సంతోష్ కుమార్ జైశ్వాల్ అనే వ్య‌క్తి న‌గ‌ర్ కొట్వ‌లి అనేప్రాంతంలో ఉన్న మున్సిపల్ క‌మిష‌న‌ర్ ఆఫీస్‌లో శానిటేష‌న్ వ‌ర్క‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే అత‌నిపై వ‌చ్చిన ప‌లు ఫిర్యాదుల కార‌ణంగా విచార‌ణ చేప‌ట్టిన క‌మిష‌న‌ర్ యోగేశ్వ‌ర్ రామ్ మిశ్రాకు దిగ్భ్రాంతిని క‌లిగించే విష‌యాలు తెలిశాయి.

విచార‌ణలో భాగంగా సంతోష్ కుమార్ జైశ్వాల్‌ను ప్ర‌శ్నించ‌గా అత‌ను దోషిగా తేలింది. దీంతో అత‌న్ని వెంట‌నే స‌స్పెండ్ చేశారు. అత‌నిపై కేసు న‌మోదు చేశారు. స్థానిక త‌హ‌సీల్దార్ దేవేంద్ర యాద‌వ్ ను అత‌ని కేసును విచారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా విచార‌ణ‌లో భాగంగా సంతోష్ కుమార్‌కు చాలా ఖ‌రీదైన కార్లు మొత్తం 9 ఉన్నాయ‌ని తేలింది. వాటిల్లో స్విఫ్ట్ డిజైర్‌, మారుతి సుజుకి ఎర్టిగా, మ‌హింద్రా స్కార్పియో, టొయోటా ఇన్నొవా, మ‌హింద్రా జైలో వంటి కార్లు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది.

Santhosh Kumar Jaiswal

కొన్ని కోట్ల‌లో ఆస్తులు..?

సంతోష్ కుమార్ సోద‌రుడు ఉమాశంక‌ర్ జైశ్వాల్‌కు ఒక మారుతి సుజుకి ఎర్టిగా, అత‌ని భార్య బేబీ జైశ్వాల్‌కు ఒక టొయోటా ఇన్నొవా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా సంతోష్ కుమార్ జైశ్వాల్ బాగోతం వెలుగులోకి రావ‌డంతో అత‌నికి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బ్యాంకుల్లో లేదా బ్యాంకు లాక‌ర్ల‌లో ఎంత డబ్బు, బంగారం దాచి ఉంచాడ‌నే విష‌యంపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. త్వ‌ర‌లోనే మొత్తం వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. కానీ సంతోష్ కుమార్‌కు కొన్ని కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న‌ట్లు మాత్రం చూచాయ‌గా అధికారులు వెల్ల‌డించారు.

అయితే సంతోష్ కుమార్ కుమార్ జైశ్వాల్ ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా ప‌నిచేస్తూ అన్ని కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎలా కూడ‌బెట్టాడు అనే విష‌యంపై అధికారులు నోరెళ్ల‌బెడుతున్నారు. అత‌ను మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫీస్‌లో ప‌లు ముఖ్య‌మైన ఫైల్స్‌, ప‌త్రాల‌ను ఫోర్జ‌రీ చేశాడ‌ని, అలాగే కొన్ని ప‌త్రాలు, ఫైల్స్ మిస్ అయ్యాయ‌ని, అందువ‌ల్లే అవినీతి ప‌రులు, అక్ర‌మార్కుల‌తో లాలూచీ ప‌డి అన్ని కోట్ల‌ను అత‌ను సంపాదించి ఉంటాడ‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివ‌రాలు బ‌య‌ట ప‌డ్డ అనంత‌రం అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM