Santhosh Kumar Jaiswal : ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సంతోష్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి నగర్ కొట్వలి అనేప్రాంతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో శానిటేషన్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతనిపై వచ్చిన పలు ఫిర్యాదుల కారణంగా విచారణ చేపట్టిన కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రాకు దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు తెలిశాయి.
విచారణలో భాగంగా సంతోష్ కుమార్ జైశ్వాల్ను ప్రశ్నించగా అతను దోషిగా తేలింది. దీంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. స్థానిక తహసీల్దార్ దేవేంద్ర యాదవ్ ను అతని కేసును విచారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా విచారణలో భాగంగా సంతోష్ కుమార్కు చాలా ఖరీదైన కార్లు మొత్తం 9 ఉన్నాయని తేలింది. వాటిల్లో స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా, మహింద్రా స్కార్పియో, టొయోటా ఇన్నొవా, మహింద్రా జైలో వంటి కార్లు ఉన్నట్లు వెల్లడైంది.
సంతోష్ కుమార్ సోదరుడు ఉమాశంకర్ జైశ్వాల్కు ఒక మారుతి సుజుకి ఎర్టిగా, అతని భార్య బేబీ జైశ్వాల్కు ఒక టొయోటా ఇన్నొవా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా సంతోష్ కుమార్ జైశ్వాల్ బాగోతం వెలుగులోకి రావడంతో అతనికి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బ్యాంకుల్లో లేదా బ్యాంకు లాకర్లలో ఎంత డబ్బు, బంగారం దాచి ఉంచాడనే విషయంపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. త్వరలోనే మొత్తం వివరాలను ప్రకటించనున్నారు. కానీ సంతోష్ కుమార్కు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు మాత్రం చూచాయగా అధికారులు వెల్లడించారు.
అయితే సంతోష్ కుమార్ కుమార్ జైశ్వాల్ ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అన్ని కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టాడు అనే విషయంపై అధికారులు నోరెళ్లబెడుతున్నారు. అతను మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో పలు ముఖ్యమైన ఫైల్స్, పత్రాలను ఫోర్జరీ చేశాడని, అలాగే కొన్ని పత్రాలు, ఫైల్స్ మిస్ అయ్యాయని, అందువల్లే అవినీతి పరులు, అక్రమార్కులతో లాలూచీ పడి అన్ని కోట్లను అతను సంపాదించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు బయట పడ్డ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…