Santhosh Kumar Jaiswal : ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సంతోష్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి నగర్ కొట్వలి అనేప్రాంతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో శానిటేషన్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతనిపై వచ్చిన పలు ఫిర్యాదుల కారణంగా విచారణ చేపట్టిన కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రాకు దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు తెలిశాయి.
విచారణలో భాగంగా సంతోష్ కుమార్ జైశ్వాల్ను ప్రశ్నించగా అతను దోషిగా తేలింది. దీంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. స్థానిక తహసీల్దార్ దేవేంద్ర యాదవ్ ను అతని కేసును విచారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా విచారణలో భాగంగా సంతోష్ కుమార్కు చాలా ఖరీదైన కార్లు మొత్తం 9 ఉన్నాయని తేలింది. వాటిల్లో స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా, మహింద్రా స్కార్పియో, టొయోటా ఇన్నొవా, మహింద్రా జైలో వంటి కార్లు ఉన్నట్లు వెల్లడైంది.
సంతోష్ కుమార్ సోదరుడు ఉమాశంకర్ జైశ్వాల్కు ఒక మారుతి సుజుకి ఎర్టిగా, అతని భార్య బేబీ జైశ్వాల్కు ఒక టొయోటా ఇన్నొవా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా సంతోష్ కుమార్ జైశ్వాల్ బాగోతం వెలుగులోకి రావడంతో అతనికి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బ్యాంకుల్లో లేదా బ్యాంకు లాకర్లలో ఎంత డబ్బు, బంగారం దాచి ఉంచాడనే విషయంపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. త్వరలోనే మొత్తం వివరాలను ప్రకటించనున్నారు. కానీ సంతోష్ కుమార్కు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు మాత్రం చూచాయగా అధికారులు వెల్లడించారు.
అయితే సంతోష్ కుమార్ కుమార్ జైశ్వాల్ ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అన్ని కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టాడు అనే విషయంపై అధికారులు నోరెళ్లబెడుతున్నారు. అతను మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో పలు ముఖ్యమైన ఫైల్స్, పత్రాలను ఫోర్జరీ చేశాడని, అలాగే కొన్ని పత్రాలు, ఫైల్స్ మిస్ అయ్యాయని, అందువల్లే అవినీతి పరులు, అక్రమార్కులతో లాలూచీ పడి అన్ని కోట్లను అతను సంపాదించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు బయట పడ్డ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…