Brahmanandam : ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. ఒకప్పటిలా కాదు. ఇప్పుడు అంతా వేగమే. ఏ రంగంలో చూసినా అన్నింటిలోనూ ప్రజలు వేగం కోరుకుంటున్నారు. అంతెందుకు.. మనకు ఒకప్పుడు మొబైల్ ఫోన్లే ఉండేవి కావు. కానీ ఇప్పుడు వాటిల్లో ఏకంగా 5జి ఇంటర్నెట్ సేవలను అత్యంత వేగంగా పొందుతున్నాం. ఒకప్పుడు ఇంటర్నెట్ సేవలను వాడుకోవాలంటే మనకు సమీపంలో ఉన్న ఇంటర్నెట్ కెఫెల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు.. మీట నొక్కితే చాలు, ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ప్రత్యక్షం అవుతుంది.
అయితే అన్ని రంగాల్లోనూ వేగంగా పనులు జరుగుతున్నాయి కనుక నేటి తరం యువత కూడా తాము చేస్తున్న పనుల్లో వేగాన్నే కోరుకుంటున్నారు. చేసే జాబ్ ఏదైనా లేదా వ్యాపారం అయినా సరే చాలా త్వరగా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే వేగం పనికిరాదని, కొన్ని సార్లు చాలా కష్డపడాల్సి ఉంటుందని సీనియర్ కమెడియన్, నటుడు బ్రహ్మానందం అన్నారు. ఈ మధ్యనే ఆయన ఒక చోట నేటి తరం యువత గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం యువతకు తొందరెక్కువన్నారు. ఏది కావాలన్నా వెంటనే జరిగిపోవాలని కోరుకుంటున్నారని, అలాగే సక్సెస్ కూడా త్వరగా రావాలని ఆశిస్తున్నారని అన్నారు.
అయితే సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదని, చాలా సార్లు ఫెయిల్ అయితేనే సక్సెస్ను అందుకోగలమని అన్నారు. లక్ ఉన్న కేవలం కొందరు మాత్రమే అతి తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, కానీ ఒక సాధారణ పౌరుడికి మాత్రం కొన్ని ఏళ్లకు ఏళ్లు శ్రమ అవసరమని అన్నారు. అయితే బ్రహ్మానందం చెప్పిన మాటలను యూత్ చెవికెక్కించుకుంటారో లేదో తెలియదు కానీ.. ఆయనను మాత్రం మీమ్స్ రూపంలో చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. అందుకనే ఆయన ఈ సలహా ఇచ్చారు కాబోలు. మరి యువత పాటిస్తారో లేదో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…