Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. బాలీవుడ్లో కూడా ఈ ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు వస్తుండడంతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ‘యానిమల్’ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో నేషనల్ క్రష్ అనే పేరును మరోసారి సార్ధకం చేసుకుంది రష్మిక. తెలుగు, తమిళ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో టాప్హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకుంది. పుష్ప సినిమాతో అభినయంలో తన సత్తా చాటింది.
‘గుడ్బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలతో బాలీవుడ్లో పాతుకుపోవాలని ప్రయత్నించిన రష్మిక ఇప్పుడు యనిమల్ హిట్తో కమర్షియల్ హీరోయిన్గా బాలీవుడ్ నాయికలకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇటీ వలే డీప్ ఫేక్ వల్ల ఇబ్బంది పడిన రష్మికకు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. దీని గురించి ఒక సమావేశంలో ఆమె స్పం దించింది. ”డీప్ ఫేక్ వల్ల సెలబ్రిటీలకే కాదు వేలాది మంది స్త్రీలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. మనలో ఉన్న బాధ అందరికీ తెలిసినప్పుడు మనకు భరోసా దక్కుతుంది. కొంతరి కారణంగా మన క్యారెక్టర్ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో మౌనం వహించడం కాదు ప్రశ్నించాలి. వాటిని ప్రతిఘటించాలి అని అన్నారు.
యానిమల్ సక్సెస్తో రష్మిక ఉత్తరాదిలో క్రేజ్ ఏర్పడిందని, ఈ సినిమాకు 4 సుమారు కోట్ల పారి తోషికం అందుకు న్న ఆమె ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు రష్మికపై ట్రోల్స్ కూడా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. చిత్రంలో రష్మిక పాత్ర చిన్నదైనా కథ బాగున్నప్పటికీ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పెట్టలేకపోయింది . అంతేకాదు గతంలో పుష్ప సినిమా విషయంలోనూ ఇదే తప్పు ఇదే ట్రోలింగ్ ఫేస్ చేసింది . రష్మిక మంచి కథ కంటెంట్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయింది అంటూ ట్రోల్ చేశారు జనాలు.ఇప్పుడు ఈ సినిమాలో కూడా డైరెక్టర్ బాగా సీన్స్ ఎలివేట్ అయ్యే విధంగా రాశాడు అని కానీ రష్మిక మందన్నా ఆ గోల్ రిచ్ కాలేకపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరైతే ఈమె ఆంటీలా తయారైపోయింది అని ..సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో కనిపించి మరో ఆంటీ అని ప్రూవ్ చేసుకుంది అని.. ఇక రష్మిక కెరియర్ కతం అని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…