Rana And Suresh Babu : టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదులో ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దగ్గరకు వెళితే పట్టించుకోలేదని అందుకే ప్రమోద్ కుమార్ కోర్టు కెళ్లారు. కోర్టు జోక్యంతో సురేష్ బాబు, రానా సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు.
సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. తాజాగా ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లోని కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో 1007 గజాల స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ స్థలం విషయంలో ముందు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు నడుచుకోవటం లేదని , తమ వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించటం లేదని బంజారా హిల్స్కి చెందిన ప్రమోద్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు.
2018లో లీజు ముగుస్తుందనగా.. ప్లాట్ నం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు ఆసక్తి చూపించటంతో ప్రమోద్ రూ.5 కోట్లు చెల్లించి, డీల్ రాసుకున్నారు. అయితే అంతకు ముందే లీజు గడువు ముగిసినా ప్రమోద్ ఖాళీ చేయటం లేదంటూ ప్రమోద్పై సురేష్ బాబు కేసు వేసి నోటీసులిచ్చారు. అయితే తన వద్ద రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సురేష్ బాబు రిజిస్ట్రేషన్ చేయటం లేదంటూ ప్రమోద్ కోర్టుని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో లీజు స్థలంలో ఉంటున్న ప్రమోద్ కుమార్ సెక్యూరిటీని తరిమి వేయడంతో పాటు ప్రమోద్ను బెదిరించారు. దీంతో ప్రమోద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవటంతో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…