Actress Hema : టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నటి హేమ ఒకరు. బ్రహ్మానందంతో ఆమె కాంబినేషన్లో వచ్చే సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో రక్తి కట్టిస్తుంటాయి. ఒకప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయాలు, బిజినెస్లు అంటూ కొంత సినిమాలు తగ్గించింది. కాంట్రవర్సీలతో కూడా వార్తలలో నిలుస్తూ ఉంటుంది హేమ. అడపా దడపా కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సన్నిహితులను కలుస్తున్నారు. కానీ సినిమాల్లో కనిపించటం తక్కువైంది. రీసెంట్గా కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ కొత్త బ్రాంచీని మణికొండలో ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ సహా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో నటి హేమ కూడా అక్కడకు వచ్చారు.
ఇటీవల సినిమాలలో పెద్దగా కనిపించడం లేదేంటి అని ప్రశ్నించగా,దానికి స్పందించిన హేమ.. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాదన ఎక్కువై పోయి, సుఖ పడటం ఎక్కువ అలవాటు అయిపోయి, కష్టపడటానికి ఇష్టపడటం లేదంతే అంటూ కాస్త సెటైరికల్గా మాట్లాడింది. అయితే కొందరు ఆమె నిజంగానే బిజినెస్లు చేస్తూ బిజీగా ఉందని అంటున్నారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? అని సదరు యాంకర్ ఇదే ప్రశ్న వేస్తే … ఆమె సమాధానం ఇవ్వలేదు. మరో ఇంటర్వ్యూలో చెబుతానంటూ దాటవేసింది. 56 సంవత్సరాల వయస్సు ఉన్న హేమ…రోజుకి ఈమె రూ.1.5 నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో హేమ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కూడా సరైన పాత్రలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్కు సపోర్ట్గా హేమ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తర్వాత ఎందుకనో హేమ మీడియా ముందుకు రావటం కూడా మానేసింది. సినిమాల్లోనూ పెద్దగా కనిపించటం లేదు. రానున్న రోజులలో ఆమె కూతురిని కూడా సినిమాలలోకి తీసుకు వస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…