Ram Charan : మెగా ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతోనే కాదు సేవా కార్యక్రమాలతోను అందరి మనసులు కొల్లగొడుతుంటారు. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలతో అశేష ప్రేక్షకాదరణ పొందగా, ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లూరి సీతారామరాజుగా అలరించిన రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ బుల్లి అభిమానిని స్వయంగా కలిసి పరామర్శించాడు.
తొమ్మిదేళ్ల మణి కుశాల్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మణి కుశాల్ అభిమాన హీరో రామ్ చరణ్. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న మణి కుశాల్ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ చరణ్ కు తెలియజేశారు. బాలుడి పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన రామ్ చరణ్ స్పర్శ్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న మణి కుశాల్ తో మాట్లాడి అతడికి ఆనందం కలిగించారు.
ధైర్యంగా ఉండాలని మణికి చెప్పడంతో పాటు బాలుడికి చరణ్ ఓ కానుక కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాబుకి క్యాన్సర్ నుంచి పోరాడే బలాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందిచాడని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ అభిమానులు చెర్రీ మంచి మనసు చూసి పొగుడుతున్నారు. మా చెర్రీ బంగారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…