Rajnikanth : నటుడు రజనీకాంత్ ఎప్పటినుండో, సినిమాల్లో నటిస్తున్నారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నారు. అసలు ఆయన గురించి పరిచయమే చేయక్కర్లేదు. సూపర్ సార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో, మళ్ళీ ఓ లైన్లోకి వచ్చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులని కొల్లగొట్టిన ఈ సినిమా, ఇంకొకసారి ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న తలైవా 171 సినిమా కోసం, ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, వార్తలు కూడా వస్తున్నాయి.
ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్ గా రజినీకాంత్ నిలవబోతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, రజనీ చేయబోయే సినిమా ఇది. ఇద్దరి అరుదైన కాంబినేషన్ కావడంతో, ఎక్స్పెక్టేషన్స్ ఓ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా మరొకసారి బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరిగి రాయడం కచ్చితం అని, ఇప్పటికే అంతా అంటున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 రూపాయల కోట్ల నుండి రూ.280 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇంత భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ రావడానికి ముందు, ఏరియా డిస్ట్రబ్బిషన్ హక్కులని తీసుకోవాల్సిందిగా, రజని ని అడిగారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. కమల్ హాసన్ తో విక్రమ్, విజయ్ తో లేవు బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేయడంతో, రజనీతో ఒక లోకేష్ సినిమా అంతకుమించి తీసుకు రానున్నారు.
ఈ సినిమాపై ఉన్న అంచనాలని, క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ రెడీ అవుతుంటే, రెమ్యునెరేషన్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు రజని. ఇండియాలోనే కాదు ఏకంగా ఆసియాలోనే, అత్యంత మొత్తం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. జైలర్ సినిమాకి రజనీకాంత్ 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకున్న హీరోగా నిలిచారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…