Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా గొప్ప పని తలపెట్టి, సంకల్పబలంతో దాన్ని పూర్తి చేయాలంటే, ఆంజనేయస్వామి ఆదర్శంగా నిలుస్తారు. అంత గొప్ప ఆయన ఆంజనేయ స్వామి. ఆయన బ్రహ్మచారి అని కూడా అంటారు. మరి, ఆంజనేయస్వామి తో పాటు, సువర్చలాదేవిని పూజిస్తాము ఎందుకు..? ఈ విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుడి గురువు సూర్యుడు. సూర్యుడుతోపాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నీ కూడా నేర్చుకున్నాడు.
ఆపైన నవ్య వ్యాకరణలుగా పిలవబడే, 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కేవలం పాణిని వ్యాకరణం ఒక్కటే, ప్రచారంలో ఉన్నది. కానీ, ఒకప్పుడు ఇంద్రం, కౌమారకం ఇలా తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. పెళ్లయిన వాళ్ళకి మాత్రమే వీటిని నేర్చుకునే అర్హత ఉంది. హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి పోవాలని అనుకున్నారు. హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చాలని త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడు దగ్గరికి వెళ్లారు.
అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుండి, ఒక కుమార్తెని సృష్టించడం జరుగుతుంది. ఈమె వర్చస్సు తో ఏర్పడింది కనుక, ఆమెకి సువర్చలా అని పేరు పెట్టారు. ఈమెని నువ్వు తప్ప ఎవరు వివాహం చేసుకోలేరు అని చెప్తారు. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని సూర్యుడు, ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపించాలని చెప్పారు.
తర్వాత, నవ్య వ్యాకరణాలన్నీ నేర్పించారు. ఆమె వలన హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. సువర్చల సుత ఆంజనేయ ఆలయం ఖమ్మం జిల్లాలో ఉంది. అక్కడ నిత్యం ధూప దీప నైవేద్యాలని పెట్టి పూజిస్తారు. కేవలం, ఈ ఒక్క చోటే కాదు గుంటూరు జిల్లాలో కూడా సీతారామచంద్రస్వామి తో పాటు, శ్రీరామనవమి రోజు నాడు, సువర్చలా హనుమంతుడికి కళ్యాణం చేస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…