ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు ప్రభాస్ తో అనుకున్న ప్రాజెక్ట్ కూడా చేరినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తల ప్రకారం.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కలయికలో ఓ మైథలాజికల్ చిత్రం బక (Baka) రూపొందనుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ బకాసురుడి పాత్రలో కనిపిస్తారని, చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోందని సమాచారం. కొన్ని నెలల క్రితం ప్రభాస్తో టెస్ట్ షూట్ కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఇరు పక్షాల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ సినిమా ముందుకు వెళ్లే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదని తెలుస్తోంది.
అయితే ప్రభాస్ తప్పుకున్న వార్తే నిజమైతే ఇది ప్రశాంత్ వర్మకు వరుసగా మరో ఎదురుదెబ్బగా మారుతుంది. ఇప్పటికే రణవీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్, అలాగే నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కూడా నిలిచిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బక సినిమా అయితే కల్కి 2898 ఏడీ: పార్ట్ 2, సలార్ పార్ట్ 2లకు ముందే సెట్స్పైకి వెళ్లనుందని ప్రచారం జరగడంతో తాజా పరిణామం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రశాంత్ వర్మ చివరి చిత్రం హనుమాన్ 2024 జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)కి పునాది పడింది. ఆయన తదుపరి నిర్ధారిత దర్శకత్వం జై హనుమాన్ కాగా, ఇందులో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్కు చెందిన నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ అనిశ్చితి వార్త నిజమే అయితే ప్రశాంత్ వర్మ కెరీర్పై ప్రశ్నార్థకాలు నెలకొనే అవకాశం ఉన్నప్పటికీ జై హనుమాన్ వంటి భారీ ప్రాజెక్ట్పై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ…
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…