తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. అదే సమయంలో వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్కప్లో అభిషేక్ శర్మకు ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోయింది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అనంతరం జీర్ణాశయ ఇన్ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చేరి నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. తిరిగి పాకిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ మరోసారి డక్నే నమోదు చేశాడు. అయితే ఈ ఫామ్ ఇబ్బందుల మధ్యన కూడా అభిషేక్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోకపోవడం గమనార్హం.
ఇషాన్ కిషన్ వరల్డ్కప్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో అర్ధశతకం సాధించిన ఇషాన్, పాకిస్థాన్పై 40 బంతుల్లో 77 పరుగులతో మ్యాచ్ గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో అతడు 17 స్థానాలు ఎగబాకి మొత్తం ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఆస్ట్రేలియాపై అద్భుత శతకం సాధించడంతో 3 స్థానాలు మెరుగుపరుచుకొని మూడో స్థానానికి చేరాడు. సౌతాఫ్రికా ఆటగాళ్లు రయాన్ రికెల్టన్ (22 స్థానాలు ఎగబాకి 11వ స్థానం), ఎయిడెన్ మార్కరమ్ (6 స్థానాలు లాభపడి 15వ స్థానం) కూడా టాప్ జాబితాలోకి దూసుకొచ్చారు. అలాగే యూఎస్ఏ ఆటగాడు సాయితేజ ముక్కామల (21వ స్థానం), ఇంగ్లండ్ యువకుడు జేకబ్ బెథెల్ (32వ స్థానం) కూడా మంచి గెయిన్ సాధించారు.
టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ యువ ఆల్రౌండర్ సైమ్ అయూబ్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్పై 3 వికెట్ల ప్రదర్శనతో అతను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. రాజా రెండో స్థానానికి పడిపోయాడు. నేపాల్కు చెందిన దిపేంద్ర సింగ్ అయిరీ, అఫ్గానిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరి వరుణ్కు చేరువయ్యాడు. జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవాన్స్ వరుసగా 3 వికెట్ల ప్రదర్శనలతో 10 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ (14వ స్థానం), జస్ప్రీత్ బుమ్రా (15వ స్థానం) కూడా ర్యాంకింగ్స్లో మెరుగుదల సాధించారు. కాగా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపించగా, టీ20 వరల్డ్కప్ ప్రదర్శనలు ర్యాంకింగ్స్పై ఎంత ప్రభావం చూపుతున్నాయో మరోసారి రుజువైంది. అయితే రానున్న మ్యాచ్లలో అయినా అభిషేక్ పరుగులు చేసి బ్యాటర్లలో తన ర్యాంకును నిలుపుకుంటాడా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి భారత్లో రియల్మి పవర్ డేస్ సేల్ పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది.…
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ…
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి…
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్…
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసుతోపాటు పలు ఇతర కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలలో రిమాండ్…
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ (MeitY) శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా పలు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చరిత్రాత్మక వారసత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమ మేథస్సు (AI)పై భారత్…