Nagarjuna : బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం ఆద్యంతం రక్తి కట్టిస్తూ సజావుగానే సాగింది. కాని ఫినాలే రోజు అన్నపూర్ణ స్డూడియో గేటు దగ్గర భీబత్సం జరిగింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసి తాజాగా చంచల్గూడ జైలుకి తరలించి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అతను పారిపోయాడంటూ ప్రచారాలు సాగగా, ప్రశాంత్ తాను ఎక్కడికి పోలేదని స్వయంగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ తర్వాత ఈ షోపై చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదో చెత్త షో.. ఈ షో ప్రసారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప అని మండిపడుతున్నారు. తాజాగా ఈ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఎక్కడ నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరు కూడా చేర్చాలిని, ఆయన ఈ గొడవలకి సూత్రధారి అని అరుణ్ చెప్పారు.
బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు బిగ్ బాస్ నిర్వహకులపైన కూడా ఫిర్యాదు చేశారు. అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. అందుకే 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అందులోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…