Nagarjuna : నాగార్జుననే అస‌లు బాధ్యుడు.. ఆయ‌న‌ని అరెస్ట్ చేయాలంటూ న్యాయ‌వాది పిటీష‌న్..!

December 22, 2023 5:28 PM

Nagarjuna : బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తూ స‌జావుగానే సాగింది. కాని ఫినాలే రోజు అన్న‌పూర్ణ స్డూడియో గేటు ద‌గ్గ‌ర భీబ‌త్సం జ‌రిగింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసి తాజాగా చంచల్‌గూడ జైలుకి త‌ర‌లించి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అత‌ను పారిపోయాడంటూ ప్ర‌చారాలు సాగ‌గా, ప్రశాంత్ తాను ఎక్క‌డికి పోలేద‌ని స్వ‌యంగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి జైలుకి త‌ర‌లించారు.

బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ త‌ర్వాత ఈ షోపై చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదో చెత్త షో.. ఈ షో ప్రసారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప అని మండిప‌డుతున్నారు. తాజాగా ఈ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్ రంగంలోకి దిగారు. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఎక్కడ నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరు కూడా చేర్చాలిని, ఆయ‌న ఈ గొడ‌వ‌ల‌కి సూత్ర‌ధారి అని అరుణ్ చెప్పారు.

petition filed against Nagarjuna for bigg boss show
Nagarjuna

బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు బిగ్ బాస్ నిర్వహకులపైన కూడా ఫిర్యాదు చేశారు. అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. అందుకే 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అందులోకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now