పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ” భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల “అడవి తల్లి మాట” సాంగ్ ను విడుదల చేశారు. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి ఈ సాంగ్ ను పాడగా, లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ థమన్ అందించారు. సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉండడంతో శ్రోతలను ఎంతగానో ఆకర్షించింది.
భీమ్లా నాయక్ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక తెలుగు రీమేక్. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్. ఈ యాక్షన్ మూవీకి మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదల కానుందని గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు.
జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుండడంతో సంక్రాంతి బరిలో సందడి చేయాల్సిన సర్కారు వారి పాట ఏప్రిల్కి వెళ్లింది. భీమ్లా నాయక్ కూడా వాయిదా పడుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో వాయిదా వేసే ప్రసక్తే లేదని కొద్దిరోజులుగా వస్తున్న అప్డేట్స్ ద్వారా అర్ధమైంది.
కానీ తాజాగా ఈ మూవీని సంక్రాంతి బరి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో పలువురు చర్చలు జరిపించిన తర్వాత సినిమా వాయిదా వేశారని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని తెలిసింది.
అప్ డేట్..
భీమ్లా నాయక్ చిత్ర విడుదలను వాయిదా వేస్తారని, సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండదని వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ స్వయంగా స్పందించారు. మూవీ యథావిధిగా జనవరిలోనే విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన అవసరం లేదని.. తాజాగా స్పష్టతను ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…