NTR : ఆర్ఆర్ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబైలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే ఫ్యాన్స్ ప్రవర్తన ఎన్టీఆర్కి అస్సలు నచ్చక పోవడంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అభిమానులు కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చారు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా ? లేదా ? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి.. అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లతోపాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టాడు. నాటు నాటు పాట కూడా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…