NTR : ఆర్ఆర్ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబైలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే ఫ్యాన్స్ ప్రవర్తన ఎన్టీఆర్కి అస్సలు నచ్చక పోవడంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అభిమానులు కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చారు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా ? లేదా ? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి.. అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లతోపాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టాడు. నాటు నాటు పాట కూడా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…