Nagarjuna : అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఆగస్టు 8వ తేదీన ఉదయం 9.42 గంటలకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇక ఇదే విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా నాగార్జున తన కుమారుడు నాగ చైతన్యపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆంగ్ల మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..
సమంతతో విడాకులు తీసుకున్న తరువాత చైతూ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఒక తండ్రిగా నా కుమారుడిని నేను అలాంటి స్థితిలో చూడలేను. కానీ చైతూకు ఇప్పుడు చక్కని తోడు లభించింది. శోభిత నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆమె అడివి శేష్తో కలిసి గూఢచారి సినిమాలో నటించినప్పటి నుంచి నాకు ఆమెతో పరిచయం ఉంది. మేము కలసినప్పుడు సినిమాలు, ఫిలాసఫీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం.. అని నాగార్జున అన్నారు.
శోభిత చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. ఆమె తల్లిదండ్రులకు చైతూ అంటే ఎంతో ఇష్టం. వారు దాదాపుగా 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ ఏర్పడింది. పెళ్లి చేసుకుంటాం అని చెప్పారు. మేము ఓకే చెప్పేశాం. చైతూ హ్యాపీగా ఉండడమే నాకు కావల్సింది. సమంతతో విడాకుల తరువాత చైతూ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు కావల్సింది కూడా అదే.. అని నాగార్జున అన్నారు.
శోభిత, చైతూ ఇద్దరు ఒక చక్కని కపుల్ అవుతారు. నా కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా ఎదిగారు. చైతూ సున్నిత మనస్కుడు. తన జీవితంలోకి ఇప్పుడు మళ్లీ హ్యాపీ క్షణాలు వచ్చాయి.. అని నాగార్జున చెప్పారు. కాగా నాగచైతన్య, సమంత ఇద్దరూ సుమారుగా 5 ఏళ్ల పాటు ప్రేమించుకుని 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ అనుకోని మనస్ఫర్థల కారణంగా వారు 2021 అక్టోబర్లో విడిపోయారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో వేర్వేరుగా ప్రకటించారు. అయితే శోభితతో చైతూ నిశ్చితార్థం అనంతరం సమంతను చైతూ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…