Potatoes : ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ అనే ప్రాంతంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ రైతు నుంచి ఆలుగడ్డలను లంచంగా డిమాండ్ చేసినందుకు గాను ఓ పోలీస్ ఎస్ఐని ఆ ఏరియా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సదరు ఎస్ఐ కోడ్ భాషలో ఆలుగడ్డలు అనే పదాన్ని ఉపయోగించాడట. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ అనే ప్రాంతంలో ఉన్న సౌరిఖ్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో భవల్పూర్ చపున్న చౌకీ అనే ఏరియాకు గాను రామ్ క్రుపాల్ అనే వ్యక్తి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఓ పని నిమిత్తం అతను ఓ రైతు నుంచి 5 కేజీల ఆలుగడ్డలను లంచంగా డిమాండ్ చేశాడు. కానీ తాను అంత ఇచ్చుకోలేనని, 2 కేజీలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. అయితే చివరకు 3 కేజీలకు బేరం కుదిరింది. కానీ ఇక్కడ ఆలుగడ్డలు అనేది కోడ్ భాష కావడం విశేషం. సదరు ఎస్ఐ తనకు కావల్సిన లంచాన్ని డబ్బుగా అడగకుండా చాలా తెలివిగా ఆలుగడ్డల రూపంలో కోడ్ భాష వాడి డబ్బు డిమాండ్ చేయడం విశేషం.
అయితే ఆ ఎస్ఐ కాల్ రికార్డ్ చేసి వైరల్ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వెంటనే కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఐ రామ్ కృపాల్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై తదుపరి విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆలుగడ్డలు అనే కోడ్ భాష వాడి రైతు నుంచి ఎస్ఐ లంచం డిమాండ్ చేయాలని చూశాడని, అందుకనే అతన్ని సస్పెండ్ చేశామని, డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారం రామ్ క్రుపాల్పై విచారణ జరుగుతుందని ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలియజేశారు. కాగా కన్నౌజ్కు చెందిన సర్కిల్ అధికారి కమలేష్ కుమార్కు ఈ కేసు విచారణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…