Naga Chaitanya : అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం మాత్రం వైవిధ్యమైన సినిమాలతో రాణిస్తున్నాడు. రీసెంట్గా ధూత అనే సినిమాతో వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన తాజాగా యూట్యూబర్ గా మారాడు. అసలు సోషల్ మీడియా అంటేనే నచ్చని ఈయన… ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నప్పటికీ చై ఎక్కువగాపెద్దగా వాడిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే వాటి ద్వారా అప్ డేట్లు ఇస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగ చైతన్య యూట్యూబ్ ఛానెల్ వాడడం నిర్ణయం వెనుక గల కారణాలు ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్ను రూపొందించిన నాగ చైతన్య.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఇక ఈ యూట్యూబ్లో నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించాడు చైతూ. ఇదంతా చూస్తుంటే ఆయన కేవలం తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు రీజన్ ఏంటని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేగు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, పనేంలేక జుట్టు, గడ్డం పెంచానంటూ కామెడీ చేశాడు చై.
నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న NC23 సినిమా రూపొందుతన్న విషయం తెలిసిదే. ఈ చిత్రం కోసమే జుట్టు, గడ్డం పెంచినట్లు ఆ తర్వాత చెప్పారు. అలాగే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ జరగ్గగా… రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి చై పక్కన హీరోయిన్ గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మొదటి సారిగా చేసిన దూత వెబ్ సిరీస్ గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న చైతన్య ఈ సారి మాత్రం మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…