Naga Chaitanya : అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం మాత్రం వైవిధ్యమైన సినిమాలతో రాణిస్తున్నాడు. రీసెంట్గా ధూత అనే సినిమాతో వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన తాజాగా యూట్యూబర్ గా మారాడు. అసలు సోషల్ మీడియా అంటేనే నచ్చని ఈయన… ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నప్పటికీ చై ఎక్కువగాపెద్దగా వాడిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే వాటి ద్వారా అప్ డేట్లు ఇస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగ చైతన్య యూట్యూబ్ ఛానెల్ వాడడం నిర్ణయం వెనుక గల కారణాలు ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్ను రూపొందించిన నాగ చైతన్య.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఇక ఈ యూట్యూబ్లో నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించాడు చైతూ. ఇదంతా చూస్తుంటే ఆయన కేవలం తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు రీజన్ ఏంటని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేగు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, పనేంలేక జుట్టు, గడ్డం పెంచానంటూ కామెడీ చేశాడు చై.
నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న NC23 సినిమా రూపొందుతన్న విషయం తెలిసిదే. ఈ చిత్రం కోసమే జుట్టు, గడ్డం పెంచినట్లు ఆ తర్వాత చెప్పారు. అలాగే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ జరగ్గగా… రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి చై పక్కన హీరోయిన్ గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మొదటి సారిగా చేసిన దూత వెబ్ సిరీస్ గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న చైతన్య ఈ సారి మాత్రం మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…