Mega Family : ఎన్ని భేదాలు ఉన్నా అంద‌రూ ఒక్క‌టే.. ఇంత‌క‌న్నా ఏం కావాలి..?

November 5, 2023 1:59 PM

Mega Family : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగిన విషయం మనకి తెలిసిందే. వరుణ్ తేజ్ పెళ్లితో, మెగా ఫ్యామిలీ ఫుల్ బిజీ అయిపోయింది. మెగా బ్రదర్స్, సిస్టర్స్ ఇలా అందరూ కుటుంబ సమేతంగా, కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీ వెళ్ళింది. బన్నీ, స్నేహ రెడ్డి కూడా, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగబాబు ఇంకో ఫోటోని షేర్ చేసి, సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.

మెగా బ్రదర్స్ బంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల పరంగా కొంచెం వేరువేరుగా అనిపించినా కూడా, వాళ్ళు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు. పవన్ కళ్యాణ్ జనసేన కి చిరు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా సపోర్ట్ పలకకపోయినా, తమ్ముడు అనుకున్న స్థాయికి చేరాలని, కోరుకునే పదవి రావాలన్నట్లుగా ఆయన ఎప్పుడూ కూడా అనుకుంటారు. మెగా బ్రదర్స్ బంధం గురించి నాగబాబు ఒక పోస్ట్ చేశారు.

Mega Family latest photo viral
Mega Family

విభేదాలు మా మద్య ఉన్న భిన్న వాదనలు వచ్చినప్పటికీ, మా బంధం నిజంగా ప్రత్యేకమైనది. ఇవన్నీ కూడా మేము చేసిన పనులు కాదు. మాకు ఇవన్నీ జ్ఞాపకాలు. ఎన్ని విభేదాలు వచ్చినా, మా బంధం ఎప్పుడు దృఢంగానే ఉంటుంది. మా సంబంధం అనేది ప్రేమతో నిర్మితమైంది. ఎన్ని జరిగినా కూడా మమ్మల్ని ఒకటే గాడిన కట్టిపడే ఆ కనెక్షన్ అంటే నాకు ఎంతో ఇష్టం అని నాగబాబు ఆ పోస్టులో చెప్పారు.

ప్రస్తుతం నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆత్మీయంగా మాట్లాడుతూ, నవ్వుతూ ఉన్న ఫోటో వస్తే కూడా చూడాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now