Meenakshi Chaudhary : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గత చిత్రంతో మాత్రం మహేశ్ నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ‘గుంటూరు కారం’ మూవీని చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రం గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ రుచి చూపించనున్నారు నిర్మాత ఎస్ రాధాకృష్ణ.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో మహేశ్, మీనాక్షిలపె ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది . ఈ వారంలోనే ఈ పాట పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. నెలాఖరుకి సినిమా మొత్తం పూర్తి కానుందట. ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు. త్వరలో రెండో పాటను విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, మహేశ్ మునుపెన్నడూ చేయని మాస్ పాత్రలో కనిపించనున్నారు. ‘గుంటూరు కారం’ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే, ఈమె పాత్ర సెకెండ్ లీడ్ హీరోయిన్గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీల మెయిన్ లీడ్గా మారింది. . దీంతో రెండో హీరోయిన్గా హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు, మీనాక్షి కాంబినేషన్ సీన్స్ హైలైట్గా ఉండబోతున్నాయట. వీళ్లిద్దరి మధ్య కాస్త సరసం, టీజింగ్ సన్నివేశాలు మెప్పిస్తాయని తెలిసింది. దీంతో ఈ కాంబోపై ఆసక్తి పెరిగిపోతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.ఈ చిత్రంతో మీనాక్షి విజయం అందుకుంటుందని అందరు భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…