గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు. ఓ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆయన యువతకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. నేటి తరం యువత ఎక్కువగా విలాసాలను కోరుకుంటూ ఖరీదైన వస్తువులు కావాలని చూస్తున్నారని, ఇందుకోసం అప్పులు చేస్తున్నారని, ఇతరుల మెప్పు పొందేందుకు అప్పులు చేసి కష్టాల పాలవుతున్నారని మనోజ్ అన్నారు. ఎవరినో మెప్పించడం కోసం అప్పులను చేసి సమస్యలను కొని తెచ్చుకోవడం సరికాదన్నారు. యువత చదువు, కెరీర్పై ఫోకస్ పెట్టాలన్నారు. ఈ సందర్బంగా తాను వాడుతున్న ఓ పాత ఐఫోన్ గురించి చెప్పుకొచ్చారు.
తాను ఇప్పటికీ ఇంకా పాత ఐఫోన్ను ఉపయోగిస్తున్నానని మంచు మనోజ్ అన్నారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదని, ఎందుకంటే ఆ ఫోన్కు తాను ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కవర్ వేసి వాడుతున్నానని తెలిపారు. అంతేకాదు, ఆ ఫోన్ను కవర్లోంచి తీసి చూపించారు కూడా. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచనలు చేశారు. డబ్బును వృథా చేయవద్దని, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలన్నారు. కాగా మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మనోజ్ ఎల్లప్పుడూ ఇలా సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యలను అందరికీ తెలిసేలా చేస్తుంటారు. ఆయన ఏ విషయాన్నయినా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. అలాగే తన మాటలు, చేష్టలతోనూ నవ్విస్తుంటారు. అయితే మనోజ్ చెప్పిన సూచనలను చాలా మంది పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఆయన చెప్పింది నిజమేనని ఏకీభవిస్తున్నారు.
ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన డేవిడ్ రెడ్డి అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురొడ్డి పోరాడిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా, మారియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు.
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…