Keerthy Suresh : ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక ప్రాజెక్ట్లు రూపొందుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ క్రేజీ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్లో పీరియాడిక్ థ్రిల్లర్గా ‘అక్క’ అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించబోతోంది. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్ రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించి అలరించనున్నారు. రాధికా ఆప్టే పెర్పార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నివేశం డిమాండ్ చేసిందంటే? ఎంతటికైనా సై అంటుంది. న్యూడ్ సన్నివేశాల్లో సైతం నటించిన అనుభవం ఆమెకి ఉంది.
లిప్ లాక్ లు..బికినీ ..బెడ్ రూమ్ సీన్లు? ఇలా ఏదైన సరే ఆమె చాలా రియలిస్టిక్గా పండించగలదు. అయితే అలాంటి నటితో కీర్తి సురేష్ ఇప్పుడు పోటీ పడాల్సిన సన్నివేశం ఎదురవుతుందా? సీన్ డిమాండ్ చేస్తే రాధిక పోటీగా తగ్గేదేలే అంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం అక్క ప్రాజెక్ట్ కోసం టీమ్ తెలివిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ వైఆర్ఎఫ్తో ఈ రంగంలోకి అడుగుపెట్టినందుకు కీర్తి చాలా సంతోషంగా ఉంది. పీరియడ్ రివెంజ్ థ్రిల్లర్గా ఇది తెరకెక్కుతోంది.
ఇందులో హీరోయిన్ రెండు పాత్రలు పోటా పోటీగా ఉంటాయట. నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయని ఇన్సైడ్ టాక్. రివేంజ్ థ్రిల్లర్ కావడంతో కంటెంట్ పరంగానూ బోల్డ్ గా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన కీర్తి ఇందులో బోల్డ్గా కనిపించడానికి అంగీకరించిందా? లేదా? అన్నది తెలియదు గానీ ఆమె పేరు ప్రధానంగా హైలైట్ అవ్వడంతో రాధికా ఆప్టేతో పోటీ పడి నటించగలదా? అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్ మెజార్టీ షూటింగ్ పూర్తయిన తర్వాతే దీని గురించి వివరాలను వెల్లడించాలని మేకర్స్ భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…