Jabardasth : జబర్దస్త్ షోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఆ షోలో ఇప్పటి వరకు టాప్ టీమ్గా కొనసాగుతూ వచ్చిన సుడిగాలి సుధీర్ టీమ్ ముగ్గురు మిత్రులు షోకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు వీరు జబర్దస్త్ షోను వీడుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేశారు. జబర్దస్త్ వేదికపైనే ఈ విషయాన్ని వెల్లడించారు.
గత కొంత కాలంగా జబర్దస్త్ షో అనేక వివాదాలకు మారుపేరుగా నిలిచింది. తాజాగా మహిళా కంటెస్టెంట్లను టీమ్ లీడర్స్ వేధిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఇక తాజాగా సుధీర్ టీమ్ బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విడుదల చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ ఎప్పటిలాగే స్కిట్ చేశారు. అనంతరం సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ స్టేజిపైకి వచ్చి తాము జబర్దస్త్ను వీడుతున్నట్లు తెలిపారు. తరువాత కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో షోలో జడ్జి రోజాతో సహా అందరూ షాకయ్యారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 10వ తేదీన శుక్రవారం ప్రసారం కానుంది.
అయితే ఇది వచ్చే ఎపిసోడ్కు చెందిన ప్రోమో కనుక నమ్మడానికి లేదు. ఇటీవల జబర్దస్త్ షోకు రేటింగ్స్ తక్కువ కావడంతో రేటింగ్స్ పెంచుకునేందుకు ఇలాంటి ప్రయోగాలను మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో వారు చేసిన ఇలాంటి ప్రయోగాలతో అభాసు పాలయ్యారు కూడా. అయితే తాజాగా వచ్చిన ప్రోమోను చూస్తే వారు నిజంగానే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా.. లేక.. రేటింగ్స్ కోసం అలా చేశారా ? అన్నది సందేహంగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎపిసోడ్ను చూస్తే అసలు విషయం తేలనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…