నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకోని ఏకైక హీరో తారకరత్న అని చెప్పాలి. నందమూరి మోహన కృష్ణ తనయుడు అయిన ఈయన… జనవరి 27న ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకి కూడా తరలించారని తెలుస్తుంది. ఈ నందమూరి హీరో ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తారకరత్న ఆస్పత్రిలో ఉండగానే అతడి భార్య అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ, పర్సనల్ సీక్రెట్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
అలేఖ్య రెడ్డి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరదలి కూతురు కావడంతో పాటు తారకరత్నను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమెకి సంబంధించిన విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తారకరత్నను వివాహం చేసుకోడానికి ముందే అలేఖ్య రెడ్డికి పెళ్లి జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని ఆమె వివాహం చేసుకోగా, అతడితో దాదాపు నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో సందీప్ రెడ్డికి అలేఖ్య విడాకులు ఇచ్చింది.విడాకులు అయిన తర్వాత కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసింది అలేఖ్య . ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా పని చేసింది. ఆ సమయంలోనే అలేఖ్య – తారకరత్న మధ్య స్నేహం పెరిగింది.
ఓ సారి తారకరత్న అలేఖ్యకి ప్రపోజ్ చేయగా, తాను తన ఇంట్లో అడగమని చెప్పిందట. సినిమా బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల అలేఖ్య ఫ్యామిలీ తారకరత్నని ఒప్పుకోలేదు. అంతకు ముందే విడాకులు తీసుకోవడం వల్ల తారకరత్న కుటుంబం వీళ్లిద్దరి పెళ్లికి అడ్డుగా నిలిచినట్లు తెలిసింది. ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోకపోయినా అలేఖ్య రెడ్డి – నందమూరి తారకరత్న 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతూ ఓ పాపకు జన్మనిచ్చారు. తారకరత్న బర్త్ డేకి బాలయ్యని ఇన్వైట్ చేయగా, ఆయనతో పాటు నారా లోకేష్ రావడం అలా నెమ్మదిగా నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…