వాణీ జయరాం.. తెలుగు, తమిళతంతో పాటు పలు భాషలలో తన గానామృతంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న గొప్ప సింగర్. ఓ నదిలా ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పాడట. కేవలం పది రోజుల చిన్నారిని చూసి ఆయన ప్రెడిక్ట్ చేయగా, అదే నిజమవ్వడం విశేషం. తన తల్లిదండ్రులకు వాణి జయరాం ఐదవ సంతానం కాగా, తాను పుట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు.
అయితే అప్పుడు ఏం పేరుపెట్టాలనేదానిపై తండ్రి తన పుట్టిన డేట్, టైమ్ తీసుకుని వెల్లూరులోని ఓ ఆస్ట్రోలజర్కి వద్దకి వెళ్లాడట. తన ఫాదర్ చెప్పిన డిటెయిల్స్ ని బట్టి ఆయన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడని వాణీ జయరాం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన జాతకం చూసి, ఈ బేబీ పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతుందని, అయితే అది విని తన ఫాదర్ నవ్వుకున్నాడని వాణీ అన్నారు.. అంతేకాదు తనకు `కలైవాణి` అనే పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మకూడా నవ్వుకుందని, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు తనకు కలైవాణి అనే పేరు నామకరణం చేశారట.
అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటే నిజమవ్వడం ఆశ్చర్యంగా ఉంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వాణి జయరాం. దాదాపు ఐదు దశాబ్దాలుగా గాయనీగా రాణిస్తున్న వాణి జయరాం అద్భుతమైన గాత్రానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చిచేరాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం `పద్మ భూషణ్` పురస్కారాన్ని ప్రకటించగా, ప్లే బ్యాక్ సింగర్గా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అందులో `శంకరాభరణం`, `స్వాతికిరణం`, తమిళంలో `అపూర్వ రాగంగల్` చిత్రాల్లోని పాటలకు ఉత్తమ గాయనీగా మూడు నేషనల్ అవార్డులు వరించాయి.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…