వాణీ జయరాం.. తెలుగు, తమిళతంతో పాటు పలు భాషలలో తన గానామృతంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న గొప్ప సింగర్. ఓ నదిలా ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పాడట. కేవలం పది రోజుల చిన్నారిని చూసి ఆయన ప్రెడిక్ట్ చేయగా, అదే నిజమవ్వడం విశేషం. తన తల్లిదండ్రులకు వాణి జయరాం ఐదవ సంతానం కాగా, తాను పుట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు.
అయితే అప్పుడు ఏం పేరుపెట్టాలనేదానిపై తండ్రి తన పుట్టిన డేట్, టైమ్ తీసుకుని వెల్లూరులోని ఓ ఆస్ట్రోలజర్కి వద్దకి వెళ్లాడట. తన ఫాదర్ చెప్పిన డిటెయిల్స్ ని బట్టి ఆయన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడని వాణీ జయరాం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన జాతకం చూసి, ఈ బేబీ పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతుందని, అయితే అది విని తన ఫాదర్ నవ్వుకున్నాడని వాణీ అన్నారు.. అంతేకాదు తనకు `కలైవాణి` అనే పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మకూడా నవ్వుకుందని, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు తనకు కలైవాణి అనే పేరు నామకరణం చేశారట.
అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటే నిజమవ్వడం ఆశ్చర్యంగా ఉంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వాణి జయరాం. దాదాపు ఐదు దశాబ్దాలుగా గాయనీగా రాణిస్తున్న వాణి జయరాం అద్భుతమైన గాత్రానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చిచేరాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం `పద్మ భూషణ్` పురస్కారాన్ని ప్రకటించగా, ప్లే బ్యాక్ సింగర్గా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అందులో `శంకరాభరణం`, `స్వాతికిరణం`, తమిళంలో `అపూర్వ రాగంగల్` చిత్రాల్లోని పాటలకు ఉత్తమ గాయనీగా మూడు నేషనల్ అవార్డులు వరించాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…