Gundamma Katha : ఆనాటి అగ్రనటులు, తెలుగు చిత్రసీమలో రెండు కళ్ళుగా విరాజిల్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతోపాటు ఎస్వీ రంగారావు, సూర్యకాంతం వంటి దిగ్గజ నటులు, సావిత్రి, జమున హీరోయిన్స్ గా నటించిన గుండమ్మ కథ మూవీ అంటే ఇప్పటికీ క్రేజే. టీవీలో ఈ సినిమా వస్తుంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మాటలు డివి నరసరాజు రాసారు.
అసలు దీన్ని రీమేక్ చేయాలన్న తలంపు కూడా వచ్చినా కాంబినేషన్ కుదరక కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణ, నాగార్జున, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ఇలా పలు కాంబినేషన్స్ లో గుండమ్మ కథ తీయాలని చూసినా సూర్యకాంతం పాత్రకు ఎవరూ దొరక్క ఊరుకున్నట్లు టాక్ నడిచింది. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, అక్కినేని నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ నిక్కరు వేసుకుని నటించి మెప్పించారు.
తీరా సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ని నిక్కరులో చూస్తే జనం తిరగబడతారేమోనని విజయా సంస్థ నిర్వాహకులు భయపడ్డారట. దాంతో 10 రోజుల ముందు ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి హాజరైన బంధువులకు చూపిస్తే బాగుందని చెప్పడంతో రిలీజ్ చేశారట. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. రచయితల సంఘానికి భీష్మాచార్యుడైన నరసరాజు సినిమాలు చాలా చూశానని, అందులో గుండమ్మ కథ ఒకటని చెప్పారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…