Green Gram : మనకు తింటానికి అందుబాటులో ఉన్న అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని మొలకెత్తించి తినవచ్చు లేదా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా మనకు అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం పెసలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలను తినడం వల్ల మన శరీరానికి ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ బి1, పాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియం, జింక్, విటమిన్ బి2, బి3, బి5, బి6, సెలీనియంలు లభిస్తాయి. దీని వల్ల మనకు పోషణ అందుతుంది.
పెసల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. పొటాషియం గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. పెసలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో వచ్చే దగ్గు, జులుబు, జ్వరం తదితర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. పెసలను తినడం వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ఇదొకటి. పెసలను తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విషయం సైంటిస్టుల పరిశోధనల్లోనూ వెల్లడైంది.
పెసల్లో పొటాషియం, మెగ్నిషియం పుష్కలంగా ఉండడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు పెసలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే గర్భిణీలు నిత్యం పెసలను తింటే ఫోలేట్ బాగా అందుతుంది. తద్వారా బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…