Gopichand : టాలీవుడ్లో కొందరు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఆన్స్క్రీన్లోనే కాకుండా ఆఫ్స్క్రీన్లోను మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో ప్రభాస్- గోపిచంద్ కాంబో ఒకటి. దర్శకుడు కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్. మొదటి హీరోగా ఈయన సినిమా నటించగా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అనంతరం విలన్ పాత్రలలో నటించారు.ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రభాస్ హీరోగా నటించినటువంటి వర్షం సినిమాలో ప్రభాస్ కు విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించారు గోపిచంద్. అయితే ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గోపిచంద్ ఇప్పుడు ప్రబాస్ కోసం విలన్గా మారబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విలన్ గా గోపిచంద్ని అనుకన్నారట. అయితే హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో గోపిచంద్ విలన్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని ఇప్పుడు ప్రభాస్ కోసం విలన్ గా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
కాగా, గోపిచంద్ ఇటీవల అన్స్టాపబుల్ షోలో పాల్గొనగా తను, ప్రభాస్ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ ‘మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు కదా ఎవరామే?’ అని అడిగాడు. దానికి ప్రభాస్, గోపిచంద్తో ‘చెప్పొద్దురా’ అంటూ అడ్డుకున్నాడు. కానీ గోపిచంద్ ‘అవును సర్ మేము 2004లో వర్షం సినిమాలో త్రిష కోసం గొడవపడ్డాం’ అని చెప్పాడు. దానికి ప్రభాస్ ‘మా వాడు సూపర్గా సమాధానం ఇచ్చాడు’ అంటూ నవ్వాడు. ఇదంతా చూస్తున్న బాలకృష్ణ ‘ఒంగోలు తెలివితేటలు ఇక్కడ వాడకు’ అంటూ గోపిచంద్ను సరదాగా అన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…