Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్గా మంచి పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపోయారు. అనుకోని కారణాల వలన ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేయడం మనం చూశాం. తమ విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వచ్చింది.
ఇటీవల సమంత, నాగ చైతన్య తిరిగి కలిసారని ప్రచారం జరిగింది. అందుకు కారణం నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వారి వద్ద హ్యాష్ అనే పెంపుడు కుక్క ఉండేది. నాగచైతన్యతో విడిపోయాక సమంత దాన్ని తనతో తీసుకెళ్లారు. అయితే, ఇటీవల యూరప్ ట్రిప్కు హ్యాష్ను తీసుకెళ్లిన ఫొటోను నాగచైతన్య షేర్ చేయడంతో సమంత దగ్గర ఉన్న పెంపుడు కుక్క నాగ చైతన్యతో ఉందని, వారిద్దరూ మళ్లీ కలిసిపోనున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వారి సన్నిహితులు తెలియజేశారు. అయితే సమంత, నాగ చైతన్య తిరిగి కలవడం మాత్రం అసాధ్యం అని కొందరు అనేవాళ్లు లేకపోలేదు.
అయితే కనీసం సినిమాలలో అయిన సరే సమంత, నాగ చైతన్య కలిసి కనిపిస్తే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారిని ఆనందపరచేందుకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. నాగ చైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఇందులో కీర్తిసురేష్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఇందులో సమంత రంగస్థలంలో చెప్పిన ఓ డైలాగ్ ను వాడబోతున్నారట. నాగచైతన్య నాకు ఏమీ అభ్యంతరం లేకపోవడంతో సమంత డైలాగ్ని వాడబోతున్నారని తెలిసింది. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఇంత పాజిటివ్గా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…