Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్గా మంచి పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపోయారు. అనుకోని కారణాల వలన ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేయడం మనం చూశాం. తమ విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వచ్చింది.
ఇటీవల సమంత, నాగ చైతన్య తిరిగి కలిసారని ప్రచారం జరిగింది. అందుకు కారణం నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వారి వద్ద హ్యాష్ అనే పెంపుడు కుక్క ఉండేది. నాగచైతన్యతో విడిపోయాక సమంత దాన్ని తనతో తీసుకెళ్లారు. అయితే, ఇటీవల యూరప్ ట్రిప్కు హ్యాష్ను తీసుకెళ్లిన ఫొటోను నాగచైతన్య షేర్ చేయడంతో సమంత దగ్గర ఉన్న పెంపుడు కుక్క నాగ చైతన్యతో ఉందని, వారిద్దరూ మళ్లీ కలిసిపోనున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వారి సన్నిహితులు తెలియజేశారు. అయితే సమంత, నాగ చైతన్య తిరిగి కలవడం మాత్రం అసాధ్యం అని కొందరు అనేవాళ్లు లేకపోలేదు.
అయితే కనీసం సినిమాలలో అయిన సరే సమంత, నాగ చైతన్య కలిసి కనిపిస్తే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారిని ఆనందపరచేందుకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. నాగ చైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఇందులో కీర్తిసురేష్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఇందులో సమంత రంగస్థలంలో చెప్పిన ఓ డైలాగ్ ను వాడబోతున్నారట. నాగచైతన్య నాకు ఏమీ అభ్యంతరం లేకపోవడంతో సమంత డైలాగ్ని వాడబోతున్నారని తెలిసింది. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఇంత పాజిటివ్గా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…