Brahmanandam : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సజావుగా సాగింది. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సినీతారల సందడి కనిపింఇంది. టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మహేశ్ బాబు – నమ్రత కూడా జూబ్లీహిల్స్లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, రామ్, స్టార్ షెట్లర్ పీవీ సింధు, యాంకర్ అనసూయ భరద్వాజ్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బ్రహ్మానందం తన సతీమణితో కలిసి హైదరాబాద్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం రావడంతో పలువురు ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఆయనతో ఫొటోలు దిగడానికి ఎంతో ఆసక్తి చూపించారు. బ్రహ్మీ కూడా వారితో ఫొటోలకి ఫోజులిచ్చాడు. ఇక బ్రహ్మానందం ఓటేసిన అనంతరం మీడియా చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధుల్లో పలువురు బ్రహ్మానందంని.. సర్, కొంతమంది ఓటేయడానికి రానివాళ్లు ఉన్నారు వాళ్ళని ఏమంటారు అని అడిగారు. దీనికి బ్రహ్మి కామెడీగా.. ఏమంటారు, ఓటు వేయని వాళ్ళు అంటారు అని చెప్పారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు.
సాధారణంగా బ్రహ్మానందం ఫేస్ చూస్తేనే మనకు తెగ నవ్వు వస్తుంది. ఇక సీరియస్గా జరుగుతున్న ఎలక్షన్స్ టైంలోను ఓటింగ్ దగ్గరికి వచ్చి కూడా తన కామెడీని చూపించడంతో ఈ బ్రహ్మానందం వీడియో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో బోలెడన్ని సరదా మీమ్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. అయితే, సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్కు అధికారులు అనుమతించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…