Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం నేడు ఫినాలే జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో విజేత ఎవరు, రన్నరప్ ఎవరు.. అనే అంశాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. పలు వార్తల నడుమ తాజాగా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అనూహ్యంగా బిగ్ బాస్ నుండి రూ. 25 లక్షలు తీసుకొని శ్రీరామ్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరిన సోహైల్ అందరికీ షాకిస్తూ టైటిల్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ లో పోటీపడ్డారు. హారికకు 5వ స్థానం, అరియానాకు 4వ స్థానం దక్కింది. టైటిల్ కోసం అభిజిత్, అఖిల్, సోహైల్ మధ్య పోటీ నెలకొంది. ఆ సమయంలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ ని సోహైల్ తీసుకున్నాడు.
ఈసారి సింగర్ శ్రీరామ్ ఆ ఆఫర్ను తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా.. టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. ఈ క్రమంలో నాగార్జున టైటిల్ దక్కుతుందని నమ్మకం లేనివారు ఎవరైనా ఒకరు.. రూ. 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవాలని సూచించగా.. శ్రీరామ్ డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కి చేరారు. నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రామ్ చరణ్, అలియా భట్, శ్యామ్ సింగరాయ్ టీమ్ గెస్ట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…