Bharat Ane Nenu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నటనలో తన తండ్రిని మరిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన మహేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్రజాదరణ పొందుతూ హిట్ అవుతున్నాయి కూడా. ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను కూడా ఒకటి. ఇందులో మహేష్ సీఎంగా నటించి మెప్పించారు.
ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్గా పెట్టారు. ఈ డైలాగ్ సినిమా రిలీజ్కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో సినిమాకు హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ప్రేక్షకులు అలరించారు.
అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేశ్ చేసే ప్రతిజ్ఞ గుర్తుంది కదా. భరత్ అనే నేను.. అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది. ఆ డైలాగ్ చెప్పడానికి మహేశ్ తీసుకున్న టైం ఎంతో తెలుసా. 2 గంటలు పైనే. ఎందుకు అంత టైం తీసుకున్నారు. ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేశ్ ఎలా ఫీల్ అయ్యారు.. అంటే.. సాధారణంగా నేతలు ప్రమాణం చేసినప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. ఇది సినిమా కనుక ఎలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్తో రావాలి. లేదంటే పేలవంగా ఉంటుంది. అందుకనే చాలా టైం తీసుకుని ఆ డైలాగ్ను చెప్పానని.. ఆ తరువాత ఎంతో గొప్పగా ఫీలయ్యానని మహేష్ అప్పట్లో అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…