Anasuya : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ట్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమైంది. అయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్నబీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓటమి చెందడంతో కార్యకర్తలు, పలువురు నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఓటమి తర్వాత కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు.
‘మీరు నిజమైన నాయకుడు సర్… ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. అయితే అనసూయ ట్వీట్పై కొందరు నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు ఆమెపై తెగ ఫైర్ అవుతున్నారు.
ఈ సారి ఎన్నికలలో చాలా మంది సెలబ్రిటీలు ఎన్నికల ఓటింగ్లో పాల్గొన్నారు. అనసూయ కూడా ఓటు వేసి అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేసింది. మరోవైపు టీవీ యాంకర్లు, బిగ్బాస్ సెలబ్రెటీలు, బిత్తిరి సత్తి సహా చాలా మంది ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో రోజుకో వీడియో చేసి గట్టిగానే ప్రమోషన్ చేశారు. కానీ ఎవరు ఎన్ని చేసినా ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం మార్పు వైపే ఫోకస్ పెట్టారు . రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ని గెలిపించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…