Alia Bhatt : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, రాజమౌళి, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, దానయ్య కలిసి పాల్గొన్నారు.
లాంచింగ్ కార్యక్రమంలో అనుకోని సంఘటన జరిగింది. అలియా భట్ కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. వెంటనే ఆమె క్షమించమన్నట్టు ఆయన కాళ్లు పట్టుకోబోయింది. రాజమౌళి మాత్రం వద్దని అలా ఆపేశాడు. మొత్తానికి ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ నంబర్ వన్ హీరోయిన్ అయిన అలియా భట్ సంస్కారం మంచిదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఈవెంట్కు రామ్ చరణ్ హాజరు కాలేకపోయాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి సందర్భంగా రామ్ చరణ్ ఇక్కడే ఆగిపోయాడు. దోమకొండలో ఘనంగా జరిగిన అనుష్పల పెళ్లిలో రామ్ చరణ్ రాయల్ లుక్ అదిరిపోయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…