ఒకప్పటి టాలీవుడ్ లవర్ బోయ్ సిద్ధార్థ్ మరియు అందాల భామ అదితి రావ్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య పలు చోట్ల జంటగా కనిపించిన వీరు శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి జంటగానే వచ్చారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారంపై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి. వీరు ఒకే టైప్ షర్ట్ లు వేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి అందరికీ మరికొంత క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే 2009 సంవత్సరంలోనే బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది అదితిరావు హైదరీ. అయితే ఈ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. 2013లో వీరు విడిపోయారు. అప్పటినుంచి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తూ వస్తున్నారు.
ఇక సిద్ధార్థ్ సైతం 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, 2007లో విడాకులు ఇచ్చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న సిద్దార్థ్.. మహాసముద్రం సినిమాతో అదితి మాయలో పడ్డట్టు టాక్. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ‘ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట నిజమే గానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు’ అని వారిద్దరు సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు సమాచారం. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేకుంటే ఇలానే ఉంటూ కాలం వెళ్లదీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
రీసెంట్ గానే అదితిరావు హైదరీ మాజీ భర్త సత్యదీప్ మిశ్రా రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ తో అదితి రిలేషన్ అనే టాపిక్ నడుస్తున్న వేళ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు సత్యదీప్. అదితితో నా రిలేషన్ కారణంగా.. నాకు ప్రేమ మీదే విరక్తి కలిగింది. మరోసారి ప్రేమలో పడటం అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు.. మళ్లీ రిలేషన్, ప్రేమ అంటేఎంతో భయపడతారు.. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం అని అదితి మాజీ భర్త సత్యదీప్ చెప్పుకొచ్చారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…