టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా ఉండే నాగ చైతన్య సమంత ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి.. కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని..విడాకులు తీసుకోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అయితే టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. వీళ్లిద్దరూ విడిపోయి చాలా రోజులే అవుతోన్నా.. తరచూ ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునూ ఉంటోంది. తాజాగా సమంతకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. చైతూ నుండి విడిపోయిన కూడా అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఓ వీడియో ను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనికి సమంత లైక్ కొట్టడమే కాకుండా బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.దీనిని బట్టి సమంత అఖిల్తో పాటు మరి కొందరు అక్కినేని,దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరగానే ఉందని అంటున్నారు. సమంత అనారోగ్యం భారిన పడిన సమయంలో అఖిల్ .. సమంత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక రీసెంట్ గా సమంత శాకుంతలం సినిమా టీజర్ పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించాడు.
సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కాని ఏమైందో ఏమో ఊహించని విధంగా విడిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…