A Ranjith Cinema OTT Streaming : మలయాళంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులని ఫుల్ థ్రిల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఎ రంజిత్. ఈ చిత్రం డిసెంబర్ 8న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమిత ప్రమోద్, హన్నా రేగి కోసి మరియు జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది.తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం మాదిరిగా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అయితే నిషాంత్ సత్తు డైరెక్షన్లో రూపొందిన ఎ రంజిత్ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తోపాటు ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ కట్టిపడేశాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. నెట్ ఫ్లిక్స్లో శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న బడ్జెట్ తో మంచి సినిమాలు తీస్తూ.. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో మలయాళ సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఎ రంజిత్ చిత్రం కూడా ఉంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కనే రంజిత్ (ఆసిఫ్ అలీ) అనే వ్యక్తి తన సినిమా కోసం రెండు స్క్రిప్ట్ లు రాసుకోవాలని భావిస్తుంటాడు.
ఈ రెండు కథలలో ఒకటి హాజనిత స్టోరీ కాగా.. మరొకటి తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసుకోవాలని భావిస్తాడు. అయితే తాను రాసుకున్న ఊహాజనిత ఘటనలే తన జీవితంలో జరుగుతుండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్రిమినల్ కేసులోను అతను ఇరుక్కుంటూ ఉంటాడు. మరోవైపు సన్నీ (సైజు కురుప్) అనే ఓ వ్యాపారవేత్త కూడా రంజిత్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. కథలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు చోటు చేసుకుంటాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…