ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఖాళీలన్నింటిని జిల్లాల వారీగా భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలో ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే పారామెడికల్, ఆప్తాలీక్ అసిస్టెంట్ విభాగాలలో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేయడానికి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకి అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
ఈ ఇంటర్వ్యూ లకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్లో ఎంపీసీ లేదా బైపిసి చేసి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పారా మెడికల్, ఆప్తాలీక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ (ఆప్టోమెట్రీ) లేదా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదా ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పారా మెడికల్ బోర్డు లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 2020 డిసెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…