పరస్త్రీపై ఉన్న వ్యామోహంతో కట్టుకున్న భార్యను కానరాని లోకాలకు పంపించాడు. వేరే మహిళపై ఆ తండ్రికి ఉన్న ప్రేమ తన బిడ్డల పాలిట శాపంగా మారింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సదరు మహిళ ఎనిమిదేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడింది. బాలుడికి మొత్తం వాతలు పెట్టిన ఘటన తమిళనాడులోని గుడియాట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
35 ఏళ్ల సెత్తు అనే వ్యక్తి ఈశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి కాపురంలో ఓ మహిళ చిచ్చు పెట్టింది. సెత్తు మరొక మహిళకు దగ్గరవటం జీర్ణించుకోలేని ఈశ్వరి తన భర్తను హెచ్చరించింది. అయినప్పటికీ తన భర్త పద్ధతిని మార్చుకోక పోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఈశ్వరి గత నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
తన భార్య మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చిన ఆ భర్త ఏకంగా తను ప్రేమించిన మహిళను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముందు నుంచి ఈశ్వరి, ఆమె పిల్లలు అంటే గిట్టని వేణి ఆ పిల్లల పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించేది. ఈక్రమంలోనే వేణి ఎనిమిదేళ్ల కుమారుడిపై అతి దారుణంగా ప్రవర్తించింది. పసిమనసు అనే జాలి, దయ లేకుండా ఇష్టానుసారంగా బాలుడికి వాతలు పెట్టడంతో 8 ఏళ్ల కుర్రాడు గట్టిగా అరుచుకుంటూ తన పెద్దమ్మ దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పాడు.
ఈ క్రమంలోనే తన పెద్దమ్మ చికిత్స నిమిత్తం బాలుని ఆస్పత్రికి చేర్పించగా.. ఆపై వేణి, సెత్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…