టెలికాం సంస్థ రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను బండిల్గా కలిగిన కొత్త ప్లాన్లను జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు. ఆ సబ్స్క్రిప్షన్ ఎప్పటికీ అలాగే కొనసాగాలంటే ఆ ప్లాన్లను గడువు తీరినకొద్దీ రీచార్జి చేస్తూ ఉండాలి. దీంతో ఆ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
ఇక ఆ సబ్స్క్రిప్షన్ ను పొందేందుకు గాను జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.499, రూ.666, రూ.888, రూ.2599, రూ.549 లలో ఏదైనా ఒక ప్లాన్ ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని జియో కొత్తగా ప్రవేశపెట్టింది.
రూ.499 ప్లాన్లో రోజుకు 3జీబీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే రూ.666 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఉచిత కాల్స్, మెసేజ్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది.
రూ.888 ప్లాన్ లో రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఉచిత కాల్స్, మెసేజ్ లు వస్తాయి. దీని వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.2599 తో రీచార్జి చేస్తే రోజుకు 2జీబీ డేటా, ఉచిత కాల్స్, మెసేజ్ లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఇక వీటితోపాటు డేటా యాడాన్ వేసుకోవచ్చు. దాని విలువ రూ.549. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. దీంట్లో ఉచిత కాల్స్, మెసేజ్ లు రావు. వాలిడిటీని 56 రోజులుగా నిర్ణయించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…