పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో లభించిన జోష్తో తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఓ వైపు వైకాపా రెడీ అవుతోంది. కానీ మరోవైపు బీజేపీ, జనసేనలకు గాజు గ్లాసు గుర్తు నిద్ర పట్టనీయడం లేదు. గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారలేదు. దీంతో ఆ పార్టీకి ఇంకా శాశ్వత గుర్తు లభించలేదు. అయితే ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును తాజాగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇంకో అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించడం ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవడమా, ఓడడమా అనే మాట అటుంచితే ఆ రెండు పార్టీలను గాజు గ్లాసు గుర్తు ఇబ్బందులకు గురి చేస్తోంది. జనసేన తాము ఆ స్థానంలో పోటీ చేస్తామన్నా బీజేపీ పట్టుబట్టి మరీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. అక్కడితో అంతా సద్దుమణిగింది అనుకుంటే తాజాగా గాజు గ్లాసు గుర్తు మొదటికే మోసం తెచ్చేట్లు కనిపిస్తోంది. బీజేపీ కాకుండా ఆ స్థానంలో జనసేన అభ్యర్థి ఉండి ఉంటే తమ పార్టీకే ఆ గుర్తును కేటాయించేవారు కదా ? అని జనసేన నాయకులు, కార్యకర్తలు లోలోపల బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు ఆ గుర్తును ఇంకొకరికి కేటాయించారు కనుక దాన్ని తీసేయించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ విషయమై బీజేపీ, జనసేనలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. వారికి అనుకూలంగా వస్తే ఓకే. లేదంటే ఉప ఎన్నికలో ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…