పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో లభించిన జోష్తో తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఓ వైపు వైకాపా రెడీ అవుతోంది. కానీ మరోవైపు బీజేపీ, జనసేనలకు గాజు గ్లాసు గుర్తు నిద్ర పట్టనీయడం లేదు. గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారలేదు. దీంతో ఆ పార్టీకి ఇంకా శాశ్వత గుర్తు లభించలేదు. అయితే ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును తాజాగా తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇంకో అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించడం ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవడమా, ఓడడమా అనే మాట అటుంచితే ఆ రెండు పార్టీలను గాజు గ్లాసు గుర్తు ఇబ్బందులకు గురి చేస్తోంది. జనసేన తాము ఆ స్థానంలో పోటీ చేస్తామన్నా బీజేపీ పట్టుబట్టి మరీ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. అక్కడితో అంతా సద్దుమణిగింది అనుకుంటే తాజాగా గాజు గ్లాసు గుర్తు మొదటికే మోసం తెచ్చేట్లు కనిపిస్తోంది. బీజేపీ కాకుండా ఆ స్థానంలో జనసేన అభ్యర్థి ఉండి ఉంటే తమ పార్టీకే ఆ గుర్తును కేటాయించేవారు కదా ? అని జనసేన నాయకులు, కార్యకర్తలు లోలోపల బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు ఆ గుర్తును ఇంకొకరికి కేటాయించారు కనుక దాన్ని తీసేయించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ విషయమై బీజేపీ, జనసేనలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. వారికి అనుకూలంగా వస్తే ఓకే. లేదంటే ఉప ఎన్నికలో ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…